19-12-2025 12:58:01 AM
కామారెడ్డి, డిసెంబర్ 18 (విజయక్రాంతి): ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం అయిన అన్ని శాఖల అధికారులకు గురువారం అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లా లో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల నిర్వహణ లో బాధ్యత గా పని చేసిన వివిధ శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా గురువారం ఎంపిడిఓ లు, వివిధ ఎన్నికల సిబ్బంది కలెక్టర్ ను శాలువాతో సన్మానించారు.