19 May, 2026 | 11:09 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

కన్నుల పండువగా నరసింహుని కల్యాణం

21-01-2026 12:12 AM

కిక్కిరిసిన పుల్లూరు బండ జాతర

సిద్దిపేట రూరల్, జనవరి 20: మాఘ అమావాస్యను పురస్కరించుకుని పుల్లూరు బండపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న జాతర ఉత్సవాల్లో 3వ రోజు లక్ష్మీనరసింహ స్వామి క ళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంతో కిటకిటలాడింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.