01-05-2025 01:24:29 AM
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గురువారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మేడే’ను పురస్కరించుకొని సీఎం రేవంత్ కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో త్వర లోనే తెలంగాణ గిగ్, ఫ్లాట్ఫాం వర్కర్స్ సంక్షేమ బిల్లు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.
అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పని చేస్తున్న గిగ వర్కర్ల కోసం 5 లక్షల ప్రమాద బీమా అమ లు చేసినట్టు గుర్తుచేశారు. ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు.
కార్మికుల శ్రేయస్సు, సంక్షే మానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధా నం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అం దుకుంటూ విజయవంతం అవుతుందని పేర్కొ న్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రా ష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు.
రాష్ట్రాభి వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి పండుగలకు ముందే బోనస్ ఇచ్చినట్టు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. తెలంగాణ కార్మికులు ఏ కారణంతోనైనా ఆయా దేశాల్లో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు.