21 May, 2026 | 3:17 PM

Breaking News

తెల్ల తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రతాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

పాత్రికేయులకు ఇచ్చిన మాట తప్పం

10-07-2024 04:12 AM
  • రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం 

ముషీరాబాద్, జూన్ 9: ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో హెచ్‌యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్ ఉర్ధూ జర్నలిస్టు ఫైజ్ అహ్మద్ అస్గర్ స్మారక అవార్డు ప్రధానోత్సవంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలతో కలిసి మం త్రి మాట్లాడారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వాటిని పరిష్కరించ డంలో మీడియాది ప్రముఖ పాత్ర ఉంటుందన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పాత్రికేయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఉత్తమ జర్నలిస్ట్‌గా ఎంపికైన వై.నరేందర్‌రెడ్డికి చేసి ఫైజ్ మహ్మద్ అస్గర్ స్మారక అవార్డును అందజేశారు. హెచ్‌యూజే అధ్యక్షుడు శిగ శంకర్‌గౌడ్ అధ్యక్షత న జరిగిన సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవలపల్లి అమర్, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఏ మాజీద్ పాల్గొన్నారు.