మహబూబ్నగర్ స్థానంలో గెలిచి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇద్దాం
వంశీచంద్ రెడ్డి
మహబూబ్నగర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): మహబూబ్నగర్ పార్లమెంట్ పరి ధిలో ఇప్పటికే రూ.10 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డికి మహబూబ్నగర్లో గెలిచి బహుమతిగా ఇద్దామని కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వంశీచంద్ మాట్లాడారు. నీరు పేదల కష్టాలను తీర్చేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేలా మరింత శ్రమిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరను రూ.1,200 చేస్తే, రాష్ట్రంలో రూ.500లకే సిలిండర్ను అందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదని స్పష్టం చేశారు. బీజేపీ భవిష్యత్తులో కనుమరుగవుతుందని అన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు మరేపల్లి సురేందర్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్, రాజు నాయక్, నవనీత, నర్సింహులు యాదవ్, రాంచందర్ నాయక్, పర్షి నాయక్ తదితరులు పాల్గొన్నారు.