22-07-2025 08:43:41 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ సుబేదార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ రోడ్డులో సిరి కిరాణంలో అర్ధరాత్రి షట్టర్ పగులగొట్టి లక్ష 30 వేల నగదును దొంగలు అపహరించినట్టు సుబేదారి సీఐ రంజిత్ కుమార్(CI Ranjit Kumar) తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.