ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదు
సిఐటియు ఖమ్మం జిల్లా కోశాధికారి చలమాల విఠల్ రావు
పెనుబల్లి, మే 22 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదనీ సీఐటీయూ ఖమ్మం జిల్లా కోశాధికారి చలమాల విఠల్రావు విమర్శించారు. సిఐటియు పెనుబల్లి మండల కమిటీ సమావేశం చలమాల సూర్యనారాయణ భవనంలో గుడిమెట్ల బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు ఖమ్మం జిల్లా కోశాధికారి చలమాల విఠల్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపుదల అశాస్త్రీయంగా ఉందని విమర్శించారు.
ఈ సమావేశంలో సిఐటియు పెనుబల్లి మండలం నాయకులు తాండ్ర రాజేశ్వరరావు, కార్మిక సంఘం నాయకులు గాయం తిరుపతిరావు, తడకమల్ల చిరంజీవి, కంటే సత్యం, రైతు సంఘం మండల అధ్యక్షులు చిట్టి మొదల కృష్ణ, సిఐటియు నాయకులు చీప్ వెంకటేశ్వర్లు, మిద్దె స్వామి, కే. రవీంద్ర,ఎస్.కె చిన్న రాజి, అనప రెడ్డి లక్ష్మయ్య, కొప్పుల గోవిందరావు, మేకల బాజీ, జీ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.






