03-02-2026 12:03:56 AM
కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాం తి): ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నిన్న ఉదయం నుంచే గ్రామ గ్రామా న గర్జించిన మా కార్యకర్తలకు, సోషల్ మీడియాలో మద్దతుగా నిలిచిన వారియర్లకు, కాంగ్రెస్కి బుద్ధి చెప్పేలా పోరాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పోస్టు చేశారు.