యాక్షన్తో మొదలెట్టారు!
సల్మాన్ఖాన్ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ మరో కీలక దశకు చేరింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లిల ఫస్ట్ కొలాబరేషన్ కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించగా, షూటింగ్ ప్రారంభంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ‘ఎస్వీసీ63’ అనే వర్కింగ్ టైటిల్తో ప్రచారంలో ఉంది. శనివారం ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం, కథానాయికగా నయనతార అధికారికంగా సెట్స్లో అడుగుపెట్టారు. ముహూర్తం కార్యక్రమంతోనే నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్ను ప్రారంభించారు మేకర్స్.
ప్రత్యేకంగా నిర్మించిన హ్యూజ్ సెట్లో హై-ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్లో నయనతార కూడా ప్రధాన తారాగణంలో చేరారు. పూర్తి తారాగణం, సాంకేతిక బృందం వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిత్రం 2027లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.






