15 April, 2026 | 3:17 AM

దుంపలకుంటలో దొంగలు బీభత్సం

29-12-2025 01:27 PM

కొల్చారం/ విజయక్రాంతి: కొల్చారం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. మండల పరిధిలోని దుంపలకుంట చౌరస్తా వద్ద అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు నాలుగు షాపుల షట్టర్ పైకి లేపి లోనికి చొరబడిన  దొంగలు దొరికి పాల్పడ్డారు. ఒక మొబైల్ షాప్ లో మొబైల్ ఫోన్లు, కిరాణా షాపులలో కిరాణా వస్తువులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.