calender_icon.png 9 December, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

09-12-2025 04:48:56 PM

జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్

గద్వాల: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సిబ్బందిని కేంద్రాలకు కేటాయించే మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్ తో కలిసి మొదటి విడత పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడవ ర్యాండమైజేషన్‌ను జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గద్వాల్, ధరూర్, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో కలిపి ఉన్న మొత్తం 974 పోలింగ్ స్టేషన్లు ఈ ర్యాండమైజేషన్‌లో భాగమయ్యాయని, వీటికి సంబంధించిన 1,50,672 మంది ఓటర్ల డేటాను సమగ్రంగా పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు.

మొదటి విడతలో మొత్తం 974 పోలింగ్ కేంద్రాల్లో 135 కేంద్రాలు ఏకగ్రీవ గ్రామాలకు చెందినందున, మిగతా పోలింగ్ స్టేషన్లకు కావాల్సిన సిబ్బంది టీముల కేటాయింపు పూర్తిచేయబడిందని తెలిపారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో 2 మంది సభ్యులతో 601 టీములు,3 మంది సభ్యులతో 238 టీములు మొత్తం 839 పోలింగ్ టీములు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతి మండలంలోని పోలింగ్ స్టేషన్ల సంఖ్య, గ్రామ పంచాయతీల సంఖ్య,ఓటర్ల వివరాలు, అవసరమైన పోలింగ్ సిబ్బంది వంటి అంశాలను పూర్తిగా పరిగణలోకి తీసుకుని సాఫ్ట్‌వేర్ ద్వారా ఆటోమేటిక్‌గా పోలింగ్ టీములను కేటాయించినట్లు వివరించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాగేంద్రం,డిపిఓ శ్రీకాంత్, ఈడియం శివ,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.