1 July, 2026 | 11:10 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఫారినర్‌తో షూట్ చేయించిన పల్లెటూరి సినిమా ఇది

13-07-2025 12:47 AM

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో రూపొందిన రూరల్ కామెడీ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. నటి, -చిత్ర నిర్మాత ప్రవీణ పరుచూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 18న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో టీమ్ శనివారం ప్రెస్‌మీట్ నిర్వహిం చింది. ఈ సందర్భంగా హీరో మనోజ్‌చంద్ర మాట్లాడుతూ.. “కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమాలో ఇదొక చోటు. కానీ ఈ సినిమా మా గుండెల్లో చోటు.

18వ తారీఖున మీ గుండెల్లోకి దూసుకొస్తున్నాం” అన్నారు. డైరెక్టర్ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. “ఇది నా మూడో సినిమా. ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనుకున్నా. పల్లెటూర్ని ఒక ఫారిన్ సినిమాటోగ్రాఫర్‌తో షూట్ చేయించాం. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అవ్వొద్దు.. చాలా గమ్మత్తుగా ఉంటుంది. హాయిగా నవ్వుకుంటారు. సెకండ్ హాఫ్‌లో నా స్టుటైల్‌లో కొన్ని సెన్సిబిలిటీస్ కాన్సెప్ట్స్.. తప్పకుండా ఆలోచన కలిగించేలా ఉంటాయి. ప్రేక్షకుల మీద నమ్మకంతో నేను డైరెక్షన్ చేసిన సినిమా ఇది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు రవీంద్ర విజయ్, బెనర్జీ, ఫణి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.