30-06-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 29(విజయక్రాంతి):ఆర్టీసీ కండక్టర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి నాన్ బేలేబుల్ కేసు నమోదు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ డిమాండ్ చేశా రు . ఆర్టీసీ కండక్టర్ మనోజ్ పై ఇద్దరి వ్యక్తులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో గేటు ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని డిమాండ్ చేశారు.రోజురోజుకీ ఆర్టీసీలో కార్మికులపై దాడులు జరుగు తున్న ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని అన్నారు. ఇప్పటి కైనా వెంటనే స్పందించి కార్మికులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్య క్రమాలు చేస్తామని హెచ్చరించారు.