రూ. 68వేలు పట్టివేత

22-04-2024 12:39:22 AM

జహీరాబాద్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి) : సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం హుస్సేల్లి గ్రామ శివారు లోని తెలంగాణ అంతర్ రాష్ట్రా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద  రూ. 68,100 నగదును పోలీసులు పట్టు కున్నారు. ఆదివారం స్థానిక చెక్‌పో స్టు వద్ద వాహనాలను తనిఖీల్లో భాగంగా బీదర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న వాహనంలో నగదు గుర్తించి పట్టుకున్నారు. తనిఖీల్లో పట్టుబడిన నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి హద్నూర్ పోలీసులకు అప్పగిం చినట్టు హద్నూర్ ఎస్‌ఐ రామానా యుడు తెలిపారు. కార్యక్రమంలో  కేంద్ర పోలీసులు బలగాలు, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.