6 May, 2026 | 5:33 PM

Breaking News

కోనరావుపేట పీఏసీఎస్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి… సీపీఐ ధర్నా   •   పంట సాగుపై రైతులకు అవగాహన   •   కోనరావుపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు –అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగండ్ల దీపక్ చౌదరి   •   పిఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏగుల నరసింహులు,వైస్ చైర్మన్   •   కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నీడ కల్పించాలని ఇందిరమ్మ పథకం   •   రైతుల సేవకు పున:రంకితమవుతా   •   రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి   •   కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ   •  

అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి

18-06-2025 09:21 AM

అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharama Raju District) రంపచోడవరం, మారేడుపల్లి దేవీపట్నం అటవీ ప్రాంతంలోని కొండమొదలు వద్ద ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, జోన్ జోన్ కమిటీ సభ్యురాలు అరుణ, ఇటీవల ఎన్ కౌంటర్ లో మృతి చెందిన చలపతిరావు భార్య అరుణ, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎం(AOB Special Zone Committee ACM) అంజు మృతి చెందారు. గ్రేహౌండ్స్ సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల నుంచి 3 ఏకే 47 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము హత్య కేసులో అరుణ నిందితురాలు. 2018లొ దుండ్రిగూడ సమీపంలో కిడారి సర్వేశ్వరరావు , సివేరి సోము హత్య జరిగింది. అరుణ స్వస్థలం విశాఖ జిల్లా పెందుర్తి మండలం కకరవాణిపాలెం. ఉదయ్ పై రూ. 25 లక్షలు, అరుణపై రూ. 20 లక్షల రివార్డు ఉందని అధికారులు పేర్కొన్నారు.