6 May, 2026 | 1:11 PM

అదుపుతప్పి ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్రగాయాలు

06-05-2026 12:32 PM

ఇల్లందు,(విజయక్రాంతి): శెట్టిపల్లి నుంచి ఇల్లందు వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో బుధవారం ఉదయం ప్రమాదకరమైన మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడటంతో లలిత, లక్ష్మీకాంత్, నాగేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో వస్తున్న ఆటోను డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో ఒక్కసారిగా పల్టీలు కొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన వారు వెంటనే స్పందించి బాధితులను బయటకు తీసి ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, గాయాలు తీవ్రంగా ఉండటంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.