6 May, 2026 | 1:01 PM

రైతన్న కన్నెర్ర..

06-05-2026 12:30 PM

-కోహెడ లో వడ్ల కొనుగోలు జాప్యం పై ధర్నా

కోహెడ, మే 6: (విజయక్రాంతి): ఐకేపీ కేంద్రంలో వడ్ల కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ.. బుధవారం కోహెడ మండలం కేంద్రం లో హుస్నాబాద్ - కోహెడ రహదారి పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం పై వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. నెల రోజుల నుంచి కేంద్రాలలో పడిగాపులు కాస్తున్నమన్నారు. వడ్ల తేమ శాతం తగ్గి నష్టపోతున్నమన్నారు. మిలర్లు సైతం తాలు నేపంతో కోత పెడుతూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికారులు, నిర్వహకులు కూడా పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను   పరిష్కరిస్తామని ఐకేపీ నిర్వహకులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.