calender_icon.png 18 June, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘థగ్ లైఫ్’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయాల్సిందే

18-06-2025 12:49:20 AM

- కమల్‌హాసన్ క్షమాపణ చెప్పాలని హైకోర్టు ఎలా అడుగుతుంది?

- ఆయన వ్యాఖ్యలను విభేదించవచ్చు కానీ.. సెన్సార్ అయిన చిత్రాన్ని ఆపలేం

- సినిమా విడుదలను ఆపే అధికారం ఎవరికీ లేదు: సుప్రీం కోర్టు 

న్యూ ఢిల్లీ, జూన్ 17: కర్ణాటకలో ‘థగ్‌లైఫ్’ చిత్రం విడుదలపై నిషేధించడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అలాగే కర్ణాటక హైకోర్టు కమల్‌హాసన్ క్షమాపణలు చెప్పాలని ఎలా అడుగు తుందని ప్రశ్నించింది. ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ‘కన్నడ’ భాషపై అభ్యంతర వ్యాఖ్యల కారణంగా కర్ణాటక ప్రభుత్వం ఆయన నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’ను ఆ రాష్ట్రంలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. చిత్రం విడుదల కోసం చిత్ర బృందం హైకోర్టును ఆశ్రయించగా, సుప్రీం కోర్టు పిటిషన్‌ను తనకు బదిలీ చేసుకున్నది.

మంగళవారం పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం చిత్రాన్ని నిరభ్యంతరంగా కర్ణాటకలో విదుడల చేసు కోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎవరైనా ఒక వ్యాఖ్య చేసినప్పుడు, దానిని ఖండించే హక్కు వ్యక్తులకు ఉంటుందే కానీ, సినిమా విడుదలతో వారికి ఎలాంటి నిమిత్తం ఉండబోదని స్పష్టం చేసింది. సినిమా విడుదల చేస్తే థియేట్లరను తగులబెడతామని బెదిరించే తరహా వ్యాఖ్యలు చేసే అధికారం సంఘాలకు ఉండదని తేల్చిచెప్పింది.

కర్ణాటక ప్రజలకు కమల్‌హాసన్ వ్యాఖ్యలతో విభేదించే స్వేచ్ఛ ఉందని చెప్తూనే, ఎవరైనా ప్రాథమిక హక్కులనూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. ఒకసారి ఒక సినిమాకు సెన్సా ర్ బోర్డు సర్టిఫికెట్ విడుదలైన తర్వాత, ఇక చిత్రాన్ని నిలుపు చేసే అధికారం ఎవరికీ ఉండదని తేల్చిచెప్పింది. అయితే.. ఆ చిత్రా న్ని చూడాలా? వద్దా? అన్నది ప్రజ లు నిర్ణయించుకుంటారని అభిప్రాయపడింది.