18-06-2025 12:47:44 AM
- 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
- విజయవంతం చేయాలని ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ, జూన్ 17: యోగా అనేదిక కేవలం వ్యక్తిగత ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా, మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యతా స్ఫూర్తిని నెలకొల్ప డానికి కూడా తోడ్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 21న విశాఖపట్నం వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఈ మేరకు యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను మోదీ విడుదల చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు. ‘యోగా.. ఒక భూమి.. ఒక ఆరోగ్యం..’ అనే థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం అని ప్రధాని తెలిపారు. చారిత్రత్మాక యోగా ప్రస్థానం విజయవంతంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు.
గత పదేళ్లుగా యోగా కేవలం భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ చేరువై వారి జీవితాల్లో సానుకూల ప్రభావం చూపడం గర్వకారణమన్నారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.