15 April, 2026 | 12:06 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

యూజీసీ-ఎన్‌ఈటీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

25-06-2025 12:49 AM

సీపీ సాయి చైతన్య 

నిజామాబాద్ జూన్ 24: (విజయ క్రాంతి): యు జి సి-ఎన్ ఈ టి పరీక్షలకు నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని సీపీ సాయి చైతన్య  పేర్కొన్నారు.  ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ డివిజన్‌లోని పరీక్ష జరిగే కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్‌ఎస్ అమలులో ఉంటుందని వెల్లడించారు.

ఈనెల 25 నుంచి 29 వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని మున్నూరుకాపు సంఘం, అర్సపల్లి బైపాస్‌రోడ్డులో ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద నిషేదాజ్ఞలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆయా కేంద్రాల సమీపంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదన్నారు. నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరగవద్దని సూచించారు.