22-01-2026 12:01:55 AM
కరీంనగర్ క్రైం, జనవరి 21 (విజయక్రాంతి): కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా జి తిరుమల్ గౌడ్ బుధవారం బా ధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఫిర్యాదుదారులు ఎవరైనా నేరుగా పోలీస్ ష్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజల భద్రతే తమ ప్రధా న లక్ష్యమని, శాంతి భద్రతల పరిరక్షణకు క ట్టుబడి పనిచేస్తామని తెలిపారు. నేరాలని యంత్రణ, ట్రాఫిక్ నియమాల అమలు, మహిళలు, బాలల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నందున ప్రజలు పోలీసులకు స హకరించాలని సూచించారు. ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలని, గాంజా, మ త్తుపానీయాలకు దూరంగా ఉండాలన్నారు. అలాగే లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.