05-06-2025 01:34:39 AM
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): క్యాబినెట్ సబ్కమిటీ, త్రీమెన్ అధికారుల కమిటీతో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి బుధవారం జరిగిన సమావేశంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘పిలిచారు..విన్నారు తప్పితే ఏ హామీ ఇవ్వలేదు’ అనే నైరాశ్యంలో ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నా యని, ఇందులో మూడు లేదా కనీసం రెండై నా డీఏలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కానీ క్యాబినెట్ సబ్కమిటీ నుంచి వారికి ఎటువంటి హామీ రాలేదు. ఎప్పటిలాగానే తమ సమస్యలను అడగడంతో ప్రధాన సమస్యలను వారికి వివరించినట్లు ఉద్యోగ జేఏసీ నేతలు తెలిపారు. మొత్తం 57 డిమాండ్లలో ఆర్థికేతర అంశాలు దాదాపు 45 ఉంటే, 12 ఆర్థికపరమైన అంశాలున్నాయి.
అయితే కనీసం ఆర్థికేతర అంశాలను కొన్నింటినైనా పరిష్కరిస్తామనే భరోసా ఇవ్వకపోవడం ఉద్యోగ సంఘాలకు మరింత అసంతృప్తిని కలిగించిందన్నారు. సాధారణ బదిలీలు, 317జీవో, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లాంటి సమస్యలెన్నో ఉన్నా వాటిపై స్పష్టత ఇవ్వకపోవడం చాలా బాధకల్గించిందని జేఏసీ నే త ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
11వేల కోట్ల బిల్లులు పెండింగ్: జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్
క్యాబినెట్ సబ్కమిటీతో సమావేశం అ నంతరం సెక్రటేరియట్ మీడియా పాయింట్లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు సదా నందంగౌడ్, దామోదర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వంగ రవీందర్, ముజీబ్, సత్యనా రాయణ, శ్యామ్ తో కలిసి చైర్మ న్ మారం జగదీశ్వర్ మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై సబ్కమిటీలో చర్చ జరిగిం దన్నారు. మొత్తం 57 డిమాండ్లపై ప్రభుత్వం చర్చించిందని తెలిపారు.
దాదాపు రూ.11వేలకోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చె ప్పారు. గురువారం జరిగే క్యాబినెట్లో పెండింగ్ సమస్యలను చర్చించి పరిష్కరిస్తామన్నారు. సస్పెండ్ అయిన ఉద్యోగుల కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల వయోపరిమితి పెంచే యోచనలో ప్రభుత్వంలేదని, తాము కూడా అడగడం లేదన్నారు.
ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఆశిస్తున్నాం: జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు
జూన్ 2న ఉద్యోగులకు తీపికబురు వస్తుందని ఆశించామని, కానీ రాలేదని జేఏసీ సెక్రటరీ జనరల్ ఏ లూరి శ్రీనివాసరావు తెలిపారు. క్యాబినెట్ సమావేశం తర్వాత ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్తోందని ఆశిస్తున్నట్లు చెప్పారు. డీఏలు, పెన్షన్లు, పెండింగ్ బిల్లులపై సబ్కమిటీ భేటీ లో పరిష్కారమవుతాయని అనుకున్నామన్నారు. 57 డిమాండ్లలో 45 ఆర్థికేతర సమస్యలే ఉన్నాయని, వాటి కి మంత్రుల సమావేశంలో పరిష్కా రం లభిస్తుందని అనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.