06-05-2025 08:16:55 AM
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan ) 6 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. 65,095 మంది భక్తులు నిన్న తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. 26,912 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సోమవారం తిరుమల హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమల కొండ, మెట్ల మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అటు తిరుమలలో నేటి నుంచి శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ రద్దు చేసిట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.