20-06-2025 12:00:00 AM
జగిత్యాల అర్బన్, జూన్ 19 (విజయక్రాంతి): వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని జగిత్యాల పట్టణంలోని పలు వార్డుల్లో దో మల నివారణకు మున్సిపల్ అధికారులు చ ర్యలు చేపట్టారు. పట్టణంలోని 10, 13, 30, 8, 4 వార్డుల్లో చెత్తను తొలగించి దోమల నివారణ రసాయనాన్ని స్ప్రే చేశారు. మురుగునీటి నిల్వలను గుర్తించి ఆయిల్ బాల్స్ వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ వర్షాకాలం లో దోమ లు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూ చించారు.
ఇంటి పరిసరాలలో మురుగునీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసు కోవాలాన్నారు. పాత టైర్లు, కొబ్బరి చిప్ప లు, పాత వస్తువులు ఇంటి పరిసరాలనుండి తొలగించాలన్నారు. నీటి కుండీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణ, శ్రీకాంత్, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.