16 April, 2026 | 5:57 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన టీఎన్జీవో నాయకులు

17-11-2025 12:22 AM

కరీంనగర్, నవంబరు 16 (విజయ క్రాంతి): హుస్నాబాద్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన సత్య నారాయణ స్వామి వ్రతం కార్యక్రమం ఎం తో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఆహ్వానం మేరకు టీఎన్జీవోల సం ఘం ప్రతినిధుల బృందం హాజరై, మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు. మంత్రిపై సత్యనారాయణ స్వామి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

అలాగే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినందుకు మంత్రికి టీఎన్జీవోల సంఘం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సంగేం లక్షణ్ రావు, కేంద్ర సంఘం నా యకులు నాగుల నరసింహ స్వామి, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేష్ భరద్వాజ్, నాయకులు భగవాన్ రెడ్డి, పవన్, వేణు, తదితరులుపాల్గొన్నారు.