calender_icon.png 23 October, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లలో పూర్తిచేయాలి

23-10-2025 01:06:58 AM

ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష 

పనుల వేగవంతానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి) : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మా ణం రెండేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. నూతన ఆసుపత్రి అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరిక రాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సం బంధించి తగిన ప్రణాళికలు సిద్ధంచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్‌లు, ఇతర నిర్మాణలు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బం ది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనుల వేగవం తానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు.

ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి పది రోజులకోకసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు వేగంగా జరిగే లా చూడాలని ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు.. ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. 

హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో  ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. నిర్మాణాలపై 24 గంటలూ ఆ  అధికారి పర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని సీఎం సూచించారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వీ శేషా ద్రి, శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, డీజీపీ శివధర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు  వికాస్‌రాజ్, క్రిస్టియానా జోం గ్తూ, ఇలంబర్తి, ముషారప్ అలీ ఫరూఖీ, హరిచందన తదితరులు పాల్గొన్నారు.