calender_icon.png 10 June, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతి ప్రచారం పనికిరాదు!

05-06-2025 12:00:00 AM

ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేయడమేకాక ఎందరో ఉగ్రవాదులను హతమార్చారు త్రివిధ దళాలకు చెందిన మన సైనికులు. తర్వాత జరిగిన మినీ యుద్ధంలో మరింత విజృంభించి పాక్ పని పట్టారు. దాంతో చేసేదేమీ లేక పాకిస్థాన్ కాల్పుల విరమణకు సిద్ధపడింది. ఈ సందర్బంగా మన సైనికుల శక్తి సామర్థ్యాలను, ధైర్య సాహసాలను ప్రతీ భారతీయుడు ప్రశంసించాలి.

గౌరవంతో సెల్యూట్ చేయాలి. అయితే, ప్రభుత్వాధినేతలు గతంలో ఇలాంటి సందర్బాలను తమ రాజకీయ లబ్ధి కోసం పార్టీ ఎదుగుదల కోసం ఉపయోగించుకున్నారు. సైనికులు యుద్ధం చేస్తే తామే చేసినట్లు, వారు సాధించిన విజయాన్ని తామే సాధించినట్టు చెప్పుకున్నారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో దీని ప్రస్తావన తప్పక తెస్తారు. ఇలాంటి అతి ప్రచారాలు రాజకీయ నాయకులకు ఎంతమాత్రం భావ్యం కాదు.

 ఎమ్.ఎస్.శాస్త్రి, హైదరబాద్