07-06-2025 07:07:23 PM
కోదాడ: జన ఆవాసాలకు రాకపోకలకు వీలు లేకుండా రోడ్ మధ్యలో మట్టి పోయడంతో రాకపోకలు బంద్ అయినాయి. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు లబోదిబోమంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పెరకనగర్ లో నూతనంగా ఇంటిని నిర్మిస్తున్న ఓ వ్యక్తి మట్టి పోయడానికి ఎక్కడ జాగా లేదనుకుంటా.. ఏకంగా రోడ్డుపైనే మట్టిని పోసి తన పని కానిస్తున్నాడు. అటుగా అనేకమంది వాహనదారులు వెళుతూ ఉంటారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్ అధికారులను కాలనీ వాసులు కోరుతున్నారు.