calender_icon.png 8 June, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన ఆవాసాలకు రాకపోకలు బంద్..

07-06-2025 07:07:23 PM

కోదాడ: జన ఆవాసాలకు రాకపోకలకు వీలు లేకుండా రోడ్ మధ్యలో మట్టి పోయడంతో రాకపోకలు బంద్ అయినాయి. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు లబోదిబోమంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పెరకనగర్ లో నూతనంగా ఇంటిని నిర్మిస్తున్న ఓ వ్యక్తి మట్టి పోయడానికి ఎక్కడ జాగా లేదనుకుంటా.. ఏకంగా రోడ్డుపైనే మట్టిని పోసి తన పని కానిస్తున్నాడు. అటుగా అనేకమంది వాహనదారులు వెళుతూ ఉంటారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్ అధికారులను కాలనీ వాసులు కోరుతున్నారు.