05-06-2025 01:26:34 AM
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట
11 మంది మృతి.. 50 మందికి పైగా గాయాలు
బెంగళూరు, జూన్ ౪: ఐపీఎల్లో తొలి టైటిల్ సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సభ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. తొలిసారి ఐపీఎల్ కప్పును అందుకున్న బెంగళూరుకు బుధవారం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పా టు చేసింది.
ఈ సందర్భంగా స్టేడియానికి వేలాదిగా అభిమానులు తరలి వచ్చా రు. ఆటగాళ్లను చూసేందుకు స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కా రు. ఇదే సమయంలో స్టేడియంలోని గేట్-2 తెరవడంతో అభిమానులు స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం పోలీసులు లాఠీచార్జి చేయడంతో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని శివాజీనగర్లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు.
కాగా మృతుల్లో ఆరు గురు పురుషులు, నలుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోం ది. కాగా తొక్కిసలాట నేపథ్యంలో బెంగళూరు జట్టు విక్టరీ పరేడ్ ర్యాలీ రద్దు చేస్తు న్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
తొక్కిసలాట దురదృష్టకరం: సీఎం సిద్ధరామయ్య
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందినట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే సీఎం సిద్ధరామయ్య హుటాహుటిన బౌరింగ్ ఆసుప త్రికి తరలివెళ్లారు. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు. అనం తరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్టు సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామన్నారు. మృతుల్లో ఎక్కువగా యువత ఉన్నారని, స్టేడియం సామర్థ్యం 35 వేలు అయితే దాదాపు 2 లక్షల మంది వరకు వచ్చారని తెలిపారు.
మృతుల కుటుంబాలకు క్షమాపణలు: డిప్యూటీ సీఎం
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొ న్నారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన డీకే మాట్లాడుతూ.. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా తరలిరావడంతో పరిస్థితిని అదుపు చేయలేకపోయామన్నారు. తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేమని, ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా తొక్కిసలాటలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు డీకే క్షమాపణలు తెలిపారు. బెంగళూరు విజయోత్సవ కార్యక్రమానికి అభిమానులు భారీగా వస్తారని ముందే అంచనా వేశామని, అందుకు 5వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. కానీ లెక్కకు మించి అభిమానులు స్టేడియానికి పోటెత్తడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందన్నారు.
స్టేడియానికి వచ్చిన వారిలో యువతే అధికంగా ఉండడంతో లాఠీఛార్జి చేయలేకపోయామన్నారు. తొక్కిసలాట విషయం తెలిసిన వెంటనే స్టేడియం వెలుపల జరిగిన కార్యక్రమాన్ని పది నిమిషాల్లోనే ముగించామన్నారు. స్టేడియం వద్ద పరిస్థితిని మాములు స్థితికి తెచ్చే ప్రయత్నం జరుగుతుందని వెల్లడించారు.
ఆర్సీబీ జట్టుకు బ్రహ్మరథం
అంతకుముందు తొలిసారి ఐపీఎల్ టైటిల్ సాధించిన రాయల్ చాలెంజర్స్ జట్టుకు బెంగళూరులో ఘనస్వాగతం లభించింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మొ దటి ఐపీఎల్ టైటిల్ అందుకున్న బెంగళూ రు జట్టుకు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి చిన్నస్వామి స్టేడియానికి వెళ్లే దారులన్ని ఎరుపు మయంతో నిండిపోయాయి.
వేలాదిగా తరలివచ్చిన క్రికెట్ ప్రేమికులు ‘ఆర్సీబీ.. ఆర్సీబీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విమానాశ్రయంలో కోహ్లీని కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. కాగా ఆటగాళ్లందరిని సన్మానించిన అనంతరం 15 నిమిషాల్లోనే కార్యక్రమం ముగిసినట్టుగా ప్రకటించారు.
అభిమానులంతా క్షేమంగా ఉండాలి: ఆర్సీబీ యాజమాన్యం
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒక ప్రకటన విడుదల చేసింది. తొక్కిసలాట వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని, మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది. ఈ సందర్భంగా గాయపడిన అభిమానులందరూ క్షేమంగా ఉండాలని, త్వరగా కోలుకో వాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొంది.
సర్కారు వైఫల్యమే కారణం: కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి పోలీసుల వైఫల్యమే కారణమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటన అత్యం త దురదృష్టకరమని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. స్టేడియం వద్దకు భారీ గా అభిమానులు వస్తారని తెలిసి కూడా తగిన ఏర్పాట్లు చేయకపోవటం దారుణమని వాపోయారు. అభిమానులను నియంత్రించలేకపోయామని సాక్షాత్తు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పేర్కొనటం వారి చేతకానితనానికి నిదర్శనమన్నారు.
తొక్కిసలాట దిగ్భ్రాంతికరం: రాష్ట్రపతి ముర్ము
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. తొక్కిసలాటలో గాయప డిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: ప్రధాని మోదీ
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వా రు త్వరగా కోలు కోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు గాయపడిన వారికి 50 వేలు నష్టపరిహారంగా చెల్లించనున్నట్టు మోదీ తెలిపారు.
ఇక కేంద్ర మంత్రి కుమారస్వామి స్పందిస్తూ.. తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు.