05-06-2025 12:25:09 AM
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ఐఏఎస్లంటే ప్రజాసేవకు టార్చ్ బేరర్లని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ట్రైనీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్లు గవర్నర్, సీఎం రేవంత్రెడ్డిను బుధవారం వేర్వేరుగా కలిశారు. రాజ్భవన్లో తనను కలిసిన ట్రైనీలను గవర్నర్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, సంకల్పంతో ఈ విజయాన్ని అందుకున్నందకు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
సేవాగుణంతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. మీరు కేవలం అధికారులు కాదని, దేశ భవిష్యత్తు అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా తెలంగాణ క్యాడర్కు చెందిన 2024 బ్యాచ్ ట్రై నీ ఐఏఎస్లు కలిశారు.
ఈ సందర్భంగా వా రిని సీఎం అభినందించి బాధ్యతల నిర్వహణపై వారికి దిశానిర్దేశం చేశారు. ట్రైనీ ఐఏఎస్లో సౌరభ్ శర్మ, సలోని ఛబ్రా, హర్షచౌదరి, కరోలిన్ చింగ్తియన్మయి, కొయ్యడ ప్రణయ్ కుమార్లతోపాటు అధికారులున్నారు.