నాగోబాను దర్శించుకున్న శిక్షణ ఐఏఎస్ అధికారులు
ఇంద్రవెల్లి అమరవీరులకు అధికారుల నివాళ్లు
ఉట్నూర్, జూన్ 10 (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను 2025 శిక్షణ ఐఏఎస్ అధికారులు దర్శించుకున్నారు. శిక్షణలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న శిక్షణ ఐపీఎస్ అధికారులు బుధవారం నాగోబా ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అధికారులను ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనందరావు ఆదివాసి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి, శాలులతో సన్మానించి నాగోబా దేవుడి ప్రసాదాన్ని అందించారు. నాగోబా దేవుడి చరిత్ర, నాగోబా జాతర సందర్భంగా ఆదివాసుల చేపట్టే పూజా విధానంపై ఐఏఎస్ అధికారులు ఆలయ పీఠాధిపతిని అడిగి తెలుసుకున్నారు.
ఇంద్రవెల్లి అమరులకు నివాళులు
జిల్లాలో పర్యటిస్తున్న 2025 శిక్షణ ఐఏఎస్ అధికారులు హరి ప్రసాద్, సాయి సురేష్, సాయి శివాని, శ్రీకాంత్ రెడ్డి, సచిన్ బసవరాం గుప్తా, పరస్ కుమార్ తదితరులు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం ను సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజన అమరవీరులకు ఘనంగ నివాళులర్పించారు. ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న జరిగిన సంఘటన వివరాలను ఆదివాసీ నాయకుడు మెస్రం నాగనాథ్ ను అడిగి తెలుసుకున్నారు.
1981లో జరిగిన సంఘటన నుండి సీఎం రేవంత్ రెడ్డి స్మారక సూపం వద్ద ఏర్పాటు చేసిన పార్క్ వరకు అధికారులకు వివరించారు. అధికారుల వెంట ఐటీడీఏ ఏపీవో ( జనరల్) వసంతరావు జాదవ్, ఏపీఓ పిటిజి ఆత్రం భాస్కర్, ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ తానాజీ జాదవ్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఐటిడి అధికారులు పాల్గొన్నారు.






