30-06-2025 08:49:30 PM
నాగారం: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజమని ఎమ్మార్వో హరి కిషోర్ శర్మ(MRO Hari Kishore Sharma) అన్నారు. తాహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఐ గా విధులు నిర్వహించిన మహమ్మద్ అల్లావుద్దీన్ పదవి విరమణ కార్యక్రమాన్ని తాహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. పలువురు శాలువాతో పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 37 ఏళ్ల సర్వీసులో అనేకమందికి సేవలందించి, ప్రజా జీవితంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారని కొనియాడారు. ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో 100 సంవత్సరాలు వర్ధిల్లాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో శాలిగౌరారం తహసిల్దార్ జామీరోద్ధిన్ డిప్యూటీ తాసిల్దార్ షాహిని బేగం సీనియర్ అసిస్టెంట్ షఫీ జూనియర్ అసిస్టెంట్లు మహేశ్వరి రేణుక ఆసిఫ్ సతీష్ ఆపరేటర్ సంజీవరెడ్డి సిబ్బంది రామ నరసయ్య నాగరాజు తదితరులు పాల్గొన్నారు.