8 మంది ఐపీఎస్ల బదిలీ
02-07-2024 12:42 AM
- గవర్నర్ ఏడీసీగా సిరిశెట్టి సంకీర్త్ కొనసాగింపు
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మరో 8 మంది ఐపీఎస్లను సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 17న 28 మంది ఐపీఎస్లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ శాఖల ప్రక్షాళనలో భాగంగా రేవంత్రెడ్డి ప్రభుత్వం వరుస బదిలీలను చేపడుతోంది.






