25-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా వివిధ ము న్సిపాలిటీలలో కమిషనర్లుగా విధు లు నిర్వర్తిస్తున్న కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుం ది. ఈ మేరకు మంగళవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీ.కే.శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
మహబూబాబాద్ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్గా రాజేశ్వర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా రవి బాబు, దేవరకద్ర మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్గా నరేష్బాబు, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా ప్రవీణ్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్గా సత్య నారాయణ రెడ్డి, దమ్మాయిగూడ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్గా వెంకట్ రెడ్డి, నాగర్కర్నూల్ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్గా నాగి రెడ్డి, మిర్యాలగూడ మున్సి పాలిటీ మున్సిపల్ కమిషనర్గా శ్రీనివాస్, జహీరాబాద్ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్గా సుభాష్రావు, గజ్వేల్ మున్సిపా లిటీ మున్సిపల్ కమిషనర్గా బాలకృష్ణ, బెల్లంపల్లి మున్సిపాలిటీ ము న్సిపల్ కమిషనర్గా రమేష్ని నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.