26 April, 2026 | 6:06 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలు!

03-12-2024 02:06 AM

హైదరాబాద్, డిసెంబర్2(విజయ క్రాంతి): వాణిజ్య పన్నుల శాఖలో పలువురు సీనియర్ అధికారులను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. హెడ్డాఫీస్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు కమి షనర్‌గా ఉన్న సాయికిశోర్, లీగల్ విభాగం అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరావును పంచాయతీరాజ్ రూరల్ డెవప్‌మెంట్ విభాగానికి బదిలీ చేసినట్లు సమాచారం.

బేగంపేట డివిజన్‌లో జేసీగా పనిచేస్తున్న శశిధర్‌ను వరంగల్‌కు పంపగా.. ఆ స్థానంలో మరో జేసీ రూపసౌమ్యను నియమించినట్లు విశ్వనీయవర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ జేసీ ఏడుకొండలును హైదరాబాద్ పంజాగుట్టకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట డివిజన్‌లో జేసీ గా పనిచేస్తున్న దీపారెడ్డితో హెడ్డాఫీస్‌లో సాయికిశోర్ స్థానాన్ని భర్తీ చేసి నట్టు సమాచారం. ఉత్తర్వులు ఇంకా వెలువడకపోయినా.. ఈ బదిలీలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.