calender_icon.png 16 October, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శక రెవిన్యూ పాలనే లక్ష్యంగా పనిచేయాలి

16-10-2025 08:52:40 PM

అదనపు కలెక్టర్ నగేష్..

గ్రామ పాలన అధికారులు సాదా బైనామా ఎంక్వైరీ పటిష్టంగా అమలు చేయాలి..

చేగుంట: చేగుంట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ నగేష్ తహసీల్దార్ కార్యాలయంలో సమావేశ నిర్వహించి, గ్రామ పాలన అధికారుల, పనితీరు, ముఖ్యంగా గ్రామ పాలనాధికారులు సాదా బై నామ ఎంక్వైరీ పటిష్టంగా అమలు చేయాలని, తహసీల్దార్ కార్యాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, అర్హులైన లబ్ధిదారులకు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యాలయ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్యలపై పరిష్కారానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోడ్యూల్ లో ఉన్న అన్ని రకాల దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని  తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ , శివ ప్రసాద్, ఆర్. ఐ సంతోష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.