11-12-2025 12:00:00 AM
బూర్గంపాడు, డిసెంబర్10,(విజయక్రాంతి): పినపాక నియోజకవర్గంలోని బూ ర్గంపాడు మండలం గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రిని సెక్టార్ల వారీగా సంబంధిత పోలింగ్ స్టేషన్లకు భద్రత నడుమ సిబ్బందిని తరలించడం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.బుధవారం బూర్గంపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సాధారణ గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో బి.రాహుల్, జిల్లా కలెక్టర్ జితేష్ పాటి ల్ వేరువేరుగా సందర్శించి గ్రామపంచాయతీ ఎన్నికల వీధులలో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చి వారి వారి పోలింగ్ స్టేషన్ లకు పంపారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బూర్గంపాడు మండలంలో 18 గ్రామపంచాయతీల సర్పంచుల ఎన్నికలకు గాను ఐదు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరగగా 13 గ్రామపంచాయతీలకు 48 మంది సర్పంచ్ పదవికి నామినేషన్లు వేసి బరిలో ఉన్నారని, అలాగే 182 వార్డులకు 57 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నుకోగా 125 వార్డులకు 308 మంది వార్డ్ మెంబర్ గా బరిలో నిలుచున్నారని అన్నారు. గురువారం జరిగే గ్రామపం చాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పో లింగ్ స్టేషనులకు ప్రత్యేక పోలీస్ భద్రత నడుమ పూర్తిస్థాయి సెక్యూరిటీతో ఆయా సెక్టార్లకు పోలింగ్ సామాగ్రి పంపించడం జరిగిందని అన్నారు.
ప్రతి సెక్టార్ రూటుల వారీగా పోలింగ్ స్టేషన్లను బట్టి సిబ్బందిని చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి పదిమంది రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందని,165 పోలింగ్ స్టేషన్లకు గాను 04 మంది జోనల్ అధికారులను , 165 పోలింగ్ స్టేషన్లకు 165 పిఓలు,240 ఓపిఓ లు మరియు రిజర్వుగా 30 మంది పోలింగ్ సిబ్బందిని కూడా నియమించడం జరిగిందని అన్నారు.
పోలింగ్ స్టేషన్లలో కరెంటు, మంచినీటి సౌకర్యం, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ స్టేషన్లలో నియమించబడ్డ సిబ్బందికి ముందుగా పోలింగ్ మెటీరియల్ ఇవ్వడం జరిగిందని, వారు సామాగ్రి సరి చూసుకున్న అనంతరం పంచాయతీ రాజ్ జిల్లా రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు, సహాయ ఎన్నికల అధికారి జమలారెడ్డి సమక్షంలో పోలీస్ స్టేషన్ నుండి బ్యాలెట్ బాక్సు లు తీసుకొని వచ్చి పోలింగ్ సిబ్బందికి అం దించడం జరిగిందని అన్నారు.ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు.
సెక్టరల్ ఆఫీసర్లు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ కు సిల్ వేసి ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని, మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ అయిపోయే సమయంలో ఓటర్లు గనక ఉంటే ప్రత్యేకంగా తయారు చేసిన స్లిప్పులను అందించి ఓటింగ్ ప్రక్రియ అయిపోగానే సామాన్లన్నీ జాగ్రత్తగా తీసుకొని భద్రత నడుమ రూట్ ఆఫీసర్ల సమక్షంలో తిరిగి తీసుకురావాలని అన్నారు.
పోలింగ్ సిబ్బందికి ఏ చిన్న సమస్య వచ్చినా సొంతం గా నిర్ణయం తీసుకోవద్దని, ఏ సమస్య ఉన్న సంబంధిత రూట్ అధికారికి మరియు ఏఆర్ఓకి తెలియజేయాలని అన్నారు. పోలింగ్ ఏజెంట్ల ద్వారా టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు గురించి సమస్య వస్తే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కరించుకోవాలని అన్నారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర్నుండి అన్ని పోలింగ్ స్టేషన్ ల నుండి గంటకు ఒకసారి పోలింగ్ సరళిని తప్పనిసరిగా ఏఆర్ఓకి తెలియజేయాలని అన్నారు.
పోలింగ్ సెక్టరల్ అధికారుల నుండి మొదలుకొని పిఓ, ఓపిఓలు మరియు పోలింగ్ స్టేషన్లో వివిధ పనులకు నియమించిన సిబ్బంది అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామపంచాయతీ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు తహశీల్దార్ ప్రసాద్,ఎంపీఓ బాలయ్య, టి వో టి లు భాస్కర్, మోహన్, ఆర్ఐలు, ఎంపీడీవో, రెవెన్యూ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.