calender_icon.png 17 November, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ కిష్టయ్యకు ఘనంగా నివాళి

01-12-2024 03:48:37 PM

కామారెడ్డి, (విజయక్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన కానిస్టేబుల్ కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పున్న రాజేశ్వర్ విటల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పూలమాలవేసి నివాళులర్పించారు.

ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ... తెలంగాణ సాధన కోసమే ప్రాణాలర్పించిన ప్రజా వీరులను భవిష్యత్ తరాలకు అందించడానికి నిరంతరం కృషి చేయాలని కోరారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం ప్రతి జిల్లా కేంద్రంలో అమరులకు నివాళులు అర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బొట్టు విట్టల్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేశ్వర్, డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లింబాద్రి, టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలకృష్ణ, పట్టణ అధ్యక్షులు బాలరాజు, టిడిపి నేత మహేష్ ముదిరాజ్, రమేష్, సత్యం ,అల్లి మోహన్ నారెడ్డిపేట నారాయణ తదితరులు పాల్గొన్నారు.