23-06-2025 05:41:38 PM
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలోని కలిగంజ్ అసెంబ్లీ స్థానానికి సోమవారం ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అలీఫా అహ్మద్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఆశిష్ ఘోష్ పై 50,000 కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అహ్మద్ 1,02,759 ఓట్లతో మొదటి స్థానం, ఘోష్ 52710 ఓట్లతో రెండవ స్థానం, కాంగ్రెస్ అభ్యర్థి కబిల్ ఉద్దీన్ షేక్ 28,348 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. టీఎంసీ భారీ విజయం దిశగా పయనిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాలిగంజ్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
"కలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో అన్ని మతాలు, కులాలు, జాతులు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమను ఎంతో ఆశీర్వదించారని, ఈ విజయానికి ప్రధాన రూప శిల్పులు 'మా, మతి, మనుష్'అని, కలిగంజ్ కు వచ్చి తన విజయం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని, వారికి వినయంగా అలీపా అహ్మద్ కృతజ్ఞతలు తెలియజేశారు. దివంగత ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ను గుర్తుచేసుకుంటూ, ఈ విజయాన్ని మాతృభూమికి, బెంగాల్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కలిగంజ్కు చెందిన తన సహచరులు అవిశ్రాంతంగా కృషి చేశారని. వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఫిబ్రవరి 2025లో సిట్టింగ్ టీఎంసీ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ ఆకస్మిక మరణం తర్వాత కలిగంజ్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీని తరువాత, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పార్టీ ఆయన కుమార్తె అలీఫా అహ్మద్ను బరిలోకి దింపింది. ఉప ఎన్నికకు గురువారం పోలింగ్ జరిగింది, సాయంత్రం 5:00 గంటల వరకు 69.85 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని చిన్న సంఘటనలు మినహా ఓటింగ్ చాలావరకు ప్రశాంతంగా జరిగింది.