calender_icon.png 24 June, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్‌లో జెండా ఎగరేసిన ఆప్

24-06-2025 12:48:41 AM

విశావదర్‌లో గెలిచిన కేజ్రీవాల్ పార్టీ

న్యూఢిల్లీ, జూన్ 23: గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. గుజరాత్‌లోని విశావదర్ నియోజకవర్గంలో అధికార బీజేపీ అభ్యర్థిని 17 వేల పైచిలుకు మె జార్టీతో ఓడించింది. జూన్ 19న దేశవ్యాప్తంగా ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. గుజరా త్‌లో రెండు, పశ్చిమబెంగాల్‌లో ఒకటి, పంజా బ్‌లో ఒకటి, కేరళలో ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్‌లోని ఒక స్థానం లో ఆప్, మరో స్థానంలో బీజేపీ, కేరళలో యూడీఎఫ్, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్, పంజా బ్‌లో ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు. 

అధికార బీజేపీని తలదన్ని.. 

గుజరాత్‌లో విశావదర్, కాడీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. విశావదర్ స్థానాన్ని ఆప్, కా డీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా విజయకేతనం ఎగురేశారు. విశావదర్‌లో ఆప్ 17 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం. 2022లో ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపేంద్ర 2023 డిసెంబర్‌లో ఆప్ కు రాజీనామా చే సి బీజేపీలో చేరడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యం అయింది.

అయితే ఉప ఎన్నిక ల్లో కూడా ఆప్‌నే విజయం వరించింది. ఇక్కడ ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్‌పై 17వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురేశారు.  కాడీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రమేశ్ చావ్డాపై 39వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురేశారు.

కేరళలోని నిలంబర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యూడీఎఫ్ అభ్యర్థి ఆర్యదాన్ షౌకత్ అధికార సీపీఎం అభ్యర్థిపై 11,077 ఓట్ల మెజార్టీతో విజ యం సాధించాడు. పశ్చిమబెంగాల్‌లోని కాలీగంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీ అభ్యర్థి అహ్మద్ 50వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. పంజాబ్‌లోని లుథియానా వెస్ట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఆప్ సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించింది.