18-09-2025 12:59:20 AM
అనంతగిరి: మండల పరిధిలోని వెంకట్రాపురం గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న ప్రజలు ప్రతిరోజు పాములతో భయాందోళనలకు అవుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పాములుసంచరిస్తున్నాయని పగటి సమయంలో కంటికి కనిపిస్తాయి. కాబట్టి ఏదో ఒక మార్గాన్ని తప్పించుకుంటున్నామని, రాత్రి సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకోని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది అన్నారు. గతంలో పాము కాటుకు గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
కాలనీలో సుమారు 120 నివాస గృహాలు ఏర్పాటు చేసుకొని, 300 ప్రజల నివాసం ఉంటున్నప్పటికీ అధికారులు కనీసం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదని, అంతేకాకుండా కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కనీస సౌకర్యాలను కాలనీ కి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు