calender_icon.png 11 December, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్

08-12-2025 01:28:20 AM

-రోడ్లకు అంతర్జాతీయ టెక్ కంపెనీల పేర్లు 

-రతన్ టాటాగా ఫ్యూచర్‌సిటీ ప్రధాన రోడ్డు

-సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన--- 

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్‌కు మరింతగా గ్లోబల్ మ్యాప్ లో చోటు కల్పించేలా సీఎం సంకల్పించారు.

అందుకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను హైదరాబాద్‌లో ప్రధాన రహదారులకు పెట్టాలని నిర్ణయించారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్  వద్ద రావిర్యాల నుంచి ప్రారంభమై ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలన్నారు. రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు ఇప్పటికే ‘టాటా ఇంటర్ చేంజ్’ అని పేరు పెట్టారు.

యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు డోనాల్ ట్రంప్ ఎవెన్యూ..

అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పేరుతో నిడొనాల్ ట్రంప్ అవెనూ్యు అని నామకరణం చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నిర్ణయంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయ బార కార్యాలయానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. 

మరిన్ని ప్రధా రోడ్లకు గ్లోబల్ దిగ్గజ కంపెనీల పేర్లు

ఢిల్లీలో ఇటీవల జరిగిన యూఎస్ -ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరమ్ (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) వార్షిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం.. హైదరాబాద్‌లోని ముఖ్య రహదారులకు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల పేర్లు పెట్టాలన్న దృష్టిలో భాగంగా మరిన్ని ప్రతిపా దనలు ఉన్నాయి.

గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని ‘గూగుల్ స్ట్రీమ్’ అని ప్రకటించేం దుకు ప్రణాళిక చేశారు. మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావిత వ్య క్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదా రులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌ రవం ఇవ్వటంతో పాటు, హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం భావిస్తున్నారు. అలాగే ఆ రోడ్లపై ప్రయాణిం చే వారికి కూడా గుర్తుంటుందనే ఉద్దేశంతో సీఎం ఈ ప్రతిపాదన చేశారు.