06-06-2025 12:42:37 AM
న్యూఢిల్లీ, జూన్ 5: 12 దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణ యం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ బుధవారం సంతకం చేశారు. కొలరాడోలో ఇటీవల యూదులపై దాడి జరిగిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణ యం తీసుకున్నట్టు తెలుస్తోంది.
భారత్ పొరుగున ఉన్న అఫ్గానిస్థాన్ సహా ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, లిబి యా, సోమాలియా, సూడాన్ దేశాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. మరో ఏడు దేశా లపై పాక్షిక నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బురుండి, క్యూబా, లావోస్, సియోరాలియోన్, టోగో, తుర్కమేనిస్థాన్, వెనెజువెలా దేశాలు పాక్షిక నిషేధిత జాబితా లో ఉన్నాయి.
జూన్ 9 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వైట్హౌస్ అధికారు లు స్పష్టం చేశారు. రెండోసారి అధికారంలో కి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా 12 దేశాల నుంచి పౌరుల రాకపై నిషేధం విధించగా, ఆయన మొదటిసారి అధికారం చేపట్టిన సమయంలోనూ 7 ముస్లిం దేశాలపై ఆంక్షలు విధించారు. ఈ నిర్ణయాన్ని అప్పట్లో అమెరికా సుప్రీంకోర్టు సైతం సమర్థించింది.
ట్రంప్ అనంతరం అధికారంలోకి వచ్చిన డెమోక్రటిక్పార్టీ అధ్యక్షు డు జో బైడెన్ 2021లో ఈ నిర్ణయాన్ని వెన క్కి తీసుకున్నారు. తాజా నిర్ణయంపై ట్రంప్ స్పందిస్తూ ‘కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన ధ్రువపత్రాలు లేకుండానే వివిధ దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి చొరబడటం వల్లే.. ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నా యి.
2017లో యూరప్లో ఎదురైన పరిస్థితులను అమెరికాలో రానివ్వం. అసురక్షిత మైన దేశాల నుంచి బహిరంగ వలసలను అనుమతించే ప్రసక్తే లేదు.అందుకే ఈ రోజు యెమెన్, సోమాలియా, హైతీ, లిబియాతో సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నా’ అని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
యూఎస్లో ఉండటం ఎవరికైనా ప్రమాదమే!
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై వెనిజువెలా దేశ మంత్రి డియోస్టాడో కాబెల్లో స్పందించారు. యూఎస్లో ఉండ టం వెనిజువెలా ప్రజలకు మాత్రమే కాదు.. ఎవరికైనా ప్రమాదకరమేనని పేర్కొనారు.