5 July, 2026 | 6:53 AM

రేపే పాలిటెక్నిక్ పరీక్ష

23-05-2024 09:50 PM

హైదరాబాద్: రేపే రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ (పాలీసెట్) పరీక్ష జరగనుంది. తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజిల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ - 2024 పరీక్షకు సర్వం సిద్ధమైంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని ఈమేరకు అధికారులు సూచించారు. రాష్ట్రంలో మూడేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకుగానూ పాలీటెక్నిక్ ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు ఎంపిసి, బైపిసి విద్యార్థులు మొత్తం 92,808 మంది హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహణకు సంబంధించి మొత్తం 259 ఎగ్జామ్ సెంటర్లను ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు.