calender_icon.png 26 June, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు గంటలు గుండె ఆపి శస్త్రచికిత్స

26-06-2025 01:21:32 AM

-అరుదైన గుండెసమస్యతో బాధపడుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

- రోబోటిక్ శస్త్రచికిత్సతో ప్రాణాలు కాపాడిన కొండాపూర్ కిమ్స్ వైద్యులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): అత్యంత అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్న 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గుండెను రెండుగంటలపాటు ఆపి, ఐదు గంటలపాటు రోబోటిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు. శస్త్రచికి త్స చేసిన చీఫ్ కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నిసర్గ ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుతూ.. “సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి సుపీరియర్ వెనా కావా రకం ఏఎస్డీ (యాట్రియల్ సెప్టల్ డిఫెక్ట్) అనే గుండె రంధ్రం ఉంది.

ఈ ఎస్వీసీ రకం అనేది ఏఎస్డీ ఉన్నవారిలో కేవలం 4.-10శాతం మందికే ఉం టుంది. కానీ, ఇతడికి డబుల్ ఎస్వీసీ ఉంది. తల, మెడ నుంచి చెడురక్తాన్ని గుండెకు తీసుకెళ్లే ప్రధాన రక్తనాళంలో కూడా సమస్య ఉంది. ఇలాంటిది సాధారణ ప్రజల్లో కేవలం 0.5శాతం మందికే వస్తుం ది. దీనికితోడు గుండె పైభాగంలోని రెండు గదుల మధ్య రంధ్రం ఉంది. దీంతో అతడికి శస్త్రచికిత్స చేయడం చాలా సంక్లిష్టంగా మారింది. చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ ఆలూరి నేతృత్వం లో అతడి సమస్య ఏంటన్నది పూర్తి స్థాయి లో పరీక్షలు చేశారు.

ట్రాన్స్యూసోఫేగియల్ ఈసీజీ, రైట్ హార్ట్ కాథెటరైజేషన్ లాంటి పరీక్షల ద్వారా వ్యాధి ని నిర్ధారించారు. అనంతరం డావిన్సి రోబో సాయంతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం రెండు గంటల పాటు గుండెను ఆపి.. రోబోటిక్ పద్ధతిలో గుండె రంధ్రాన్ని మూసేసేందుకు శస్త్రచికిత్స చేశా రు. మొత్తం శస్త్రచికిత్సకు ఐదు గంటలకు పైగా సమ యం పట్టింది. ఎద భాగంలో కేవ లం చిన్న రంధ్రం మాత్రమే చేసి, దాని ద్వా రానే రం ధ్రాన్ని పూడ్చేశాం.

ఇప్పుడు ఆ యు వకుడు చాలా త్వరగా కోలుకున్నాడు. శస్త్రచికిత్స జరిగిన వారం రోజులకే అతడిని డిశ్చా ర్జి చేశాం. ఈ కేసులో సరైన సమయానికి రోగి రావడంతో శస్త్రచికిత్స చేశాం. ఇక అత డు సాధారణ జీవితం గడపొచ్చు” అని చెప్పా రు. శస్త్రచికిత్స చేసిన బృందంలో చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నిసర్గ, కార్డియాక్ సర్జన్ డాక్టర్ వినీత్, కార్డియాక్ ఎనస్థీషియాలజిస్టులు డాక్టర్ దివ్య, డాక్టర్ గోరింత, సీనియ ర్ సర్జికల్ అసిస్టెంట్ మనో, సీనియర్ క్లినికల్ పెర్ఫ్యూజినిస్టులు దయాకర్ స్వామి, జగన్మోహన్ తదితరులు ఉన్నారు.