calender_icon.png 24 February, 2026 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

24-02-2026 01:24:56 AM

  1. మరొకరి పరిస్థితి విషమం
  2. బైక్‌ను ఢీకొట్టిన కంటైనర్
  3. రంగారెడ్డి జిల్లా నాగర్‌గూడ చౌరస్తాలో ఘటన

చేవెళ్ల ఫిబ్రవరి 23(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. షాబాద్ మండ లం హైతాబాద్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. నాగర్‌గూడ చౌరస్తా వద్ద వారి బైక్‌ను కంటైనర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలోబైక్‌పై వెళ్తున్న దాసరి అజయ్(19), ఉదయ్‌కిరణ్(20) మృతి చెం దారు.

అజమ్(19)కి తీవ్ర గాయాలు కాగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇరువురి మృతదేహాలను చేవెళ్లలోని ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అయితే అర్ధరాత్రి ఈ యువకులు నాగర్‌గూడ ఈసీ వాగు దాటాక అల్లవాడ రెవెన్యూలో ఉన్న పెట్రోల్‌బంకులో పెట్రోల్ పోసుకొని తిరిగొ స్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. అజయ్‌కి అమ్మలేదు. నాన్నతో ఉంటూ చికెన్ షాప్‌లోకూలీగా చేస్తున్నాడు. ఉదయ్‌కిరణ్ కూడా కూలీనే. ఇద్దరు యువకులు దుర్మరణం చెందడంతో హైతాబాద్ లో విషాదఛాయలు అమ్ముకున్నాయి. 

సీఐ వాహనంలో ఆస్పత్రికి తరలింపు

మొయినాబాద్ సీఐ పావనకుమార్‌రెడ్డి విజిటింగ్ నిమితం వెళ్లుతున్నాడు. ఆ సమ యంలో అటు రావడంతో గాయాలైన అజమ్‌ను ఆయన కారులో హాస్పిటల్‌కు తరలించారు. చేవెళ్ల ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి, మొ యినాబాద్ ఎస్‌ఐ నర్సింహారావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. చనిపోయిన యువకుల శరీర భాగాలూ చిన్నభిన్నమయ్యాయి. పోలీసులతో కలిసి స్థానికులు సహాయక చర్యలు చేశారు.