13 July, 2026 | 9:54 PM

Breaking News

తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •  

రెండు లారీలు ఢీ... ఒకరి మృతి

26-06-2025 07:35 PM

మరొకరికి గాయాలు..

లక్షెట్టిపేట (విజయక్రాంతి):  మండలంలోని ఇటిక్యాల స్టేజి సమీపంలో ఎన్హెచ్-63 రోడ్డుపై బుధవారం అర్ధరాత్రి (రాత్రి 12.30గంటలకు) రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో సిమెంట్ లోడ్ ట్యాంకర్ డ్రైవర్ తాళ్లపల్లి శ్రీనివాస్(52) అక్కడికక్కడే లారీలో ఇరుక్కుని తీవ్ర గాయాలు అయి మృతి చెందాడని స్థానిక ఎస్సై గోపతి సురేష్(SI Gopathi Suresh) తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... మృతుడు కాశిపేట మండలంలోని పల్లంగుడా గ్రామానికి చెందిన వాడని తన లారీ దేవపూర్ లో లోడ్ చేసుకొని మహారాష్ట్ర నాందేడ్ వైపుకు వెళ్తుండగా లక్షెట్టిపేట వైపు నుండి మంచిర్యాల వైపు వెళ్తున్న సంతూర్ సబ్బుల లోడ్ తో వెళ్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టడం జరిగిందన్నారు.

ఈ ప్రమాదంలో రెండు లారీలు నుజ్జునుజ్జు అయి రోడ్డుపైనే ఉండటంతో రాత్రి సుమారు 3 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్ సిబ్బందితో కలిసి రెండు క్రేనులు, జేసిబిల సహాయంతో లారీల్లో ఉన్న డ్రైవర్ శ్రీనివాస్ మృతదేహాన్ని బయటకు తీశారు. రోడ్డుపై నుండి లారీలను తొలగించి వాహనాలను పంపించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ సచిన్ కుమార్ కి కూడా గాయాలు అయ్యాయి. మృతుడు శ్రీనివాస్ భార్య తాళ్లపల్లి విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.