calender_icon.png 21 June, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు ఎస్‌ఐలకు సీఐగా పదోన్నతి

10-06-2025 12:40:33 AM

అభినందించిన ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, జూన్ 9 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్‌ఐలకు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతిని కల్పిస్తూ మల్టీ జోన్ 2 ఐజి వి.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. 2012లో పోలీసు శాఖలో సబ్-ఇన్స్పెక్టర్స్ గా నియామకమైన వెంకట్ రెడ్డి, ప్రసాద్ రావు గడిచిన గడిచిన 13 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ లలో ఎస్‌ఐలు గా విధులు నిర్వహించి, విశిష్ట సేవలందించినట్లు తెలిపారు.

ప్రస్తుతం వెంకట్రెడ్డి సిర్గాపూర్ ఎస్‌ఐగా, ప్రసాదరావు జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐగా పనిచేశారు. సర్వీసులో ఎలాంటి రిమార్క్ లేకుండా అధికారుల మన్ననలు పొందారని, వీరు అందించిన ఉత్తమ సేవలకు గాను సీఐలుగా పదోన్నతి కలిస్తూ ఉత్తర్వులు వెల్లడించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ అభినందించారు.