calender_icon.png 22 September, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

22-09-2025 01:07:23 AM

  1. వారి ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొన్న కారు 

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 

గచ్చిబౌలి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మెహిదీపట్నం ఎక్స్ రోడ్స్ హనుమాన్ దేవాలయం సమీపంలో టోలిచౌకీకి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన టయోటా కొరోల్లా ఆల్టిస్ కారు వారిని ఢీకొట్టింది.

దీంతో వారిద్దరు తీవ్రంగా గాయ పడ్డారు.స్థానికులు బాధితులను ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు వారిని మరణించినట్లు ధ్రువీకరించారు. టోలిచౌకీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగులు మహ్మద్ అబ్దుల్ అహద్ ఖాన్ (25), మహ్మద్ నజీర్ ఫహద్ (22)గా గుర్తించారు.  కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా, అత్యధిక వేగంతో నడపడం వల్ల  ప్రమాదం జరిగిందని, కేసు  దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.