22-09-2025 01:08:39 AM
వైఏసీ ఫౌండర్ రాజేందర్
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదా ర్థాలపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలని యూత్ ఫర్ యాంటి కరప్షన్ సంస్థ (వైఏసీ) ఫౌండర్ రాజేందర్ పల్నాటి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
డ్రగ్స్ కేసుల్లో పట్టుబడు తున్న వారిలో అత్యధికంగా యువతే ఉం టున్నారన్నారు.2020 జనవరి నుంచి 20 25 జూలై వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, గం జాయి, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన 40 ఏళ్ల యువత 14వేల మంది ఉన్నారని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధి కా రులు ఆర్టీఐ కింద వివరించినట్లు తెలిపారు.